ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంపూర్ణ మెజార్టీతో వస్తాం: యోగి ఆథిత్య నాథ్

national |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 04:08 PM

ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి యోగి ఆథిత్యనాథ్  పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఐదవ దశ ఎన్నికలకు ముందు, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో బిజెపి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని, అలాగే 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బహుజన సమాజ్‌ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలపై విరుచుకుపడిన సీఎం.. పేదల రేషన్‌ తినేవారి కోసం తమ వద్ద బుల్‌డోజర్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఏనుగు జారి పడి పోతుందని, సైకిల్‌కి సులువుగా పంక్చర్ అవుతుంది అని పేర్కొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమాజ్వాదీ పార్టీ ని, బహుజన్ సమాజ్ పార్టీ ని టార్గెట్ చేశారు. పేదల రేషన్‌ తిన్న వారికి బుల్‌డోజర్‌లు పెట్టాం అని వెల్లడించారు. బుల్‌డోజర్‌ పవర్‌ అంటే అది యూపీ నిర్మాణానికి మరియు అక్రమ మాఫియాలను, అవినీతిని తరిమికొట్టడానికి ఉపయోగపడుతుందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa