ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

international |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 05:26 PM

పోలండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విద్యార్థులకు ఊరట కలిగించేలా ఆదేశాలు జారీ చేసింది. వీసాలు లేకపోయినా భారతీయులను తమ దేశంలోకి అనుమతించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే బిక్కుబిక్కుమంటూ ఉక్రెయిన్‌లో తలదాచుకుంటున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ పేరుతో స్వదేశానికి తరలిస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ పొరుగు దేశమైన పోలండ్ ప్రభుత్వం నుంచి తీపి కబురు అందింది. ఇప్పటికే బాంబుల మోత, క్షిపణి దాడులు జనావాసాలపైనా జరుగుతున్నాయి. ఇక ఉక్రెయిన్ ప్రభుత్వం కూడా ప్రజలకు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఆ దేశంలో కర్ఫ్యూ విధించారు. దీంతో చేసేదేమీ లేక ప్రజలంతా బంకర్లు, అండర్ గ్రౌండ్‌లలోనే తలదాచుకుంటున్నారు. ఈ తరుణంలో తమ దేశ సరిహద్దు వద్దకు వచ్చే వారికి ఊరట కలిగించేలా పోలండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa