ఖర్జూరంను చూడగానే వెంటనే తినేయాలనిపిస్తుంది. ఎంతో తీయగా ఉండే ఖర్జూరాలలో శరీరానికి అవసరమైన ఎన్నో ఔషద గుణాలు మెండుగా ఉన్నాయి. ఫ్రక్టోజ్, డెక్స్ట్రోజ్ వంటి పిండి పందార్ధాలు మెండుగా ఇందులో ఉంటాయి. ఫలితంగా తిన్న వెంటనే మనకు శక్తి లభిస్తుంది. యాంటీ యాక్సిడెంట్లు టానిన్లు కూడా పుష్కలంగా ఉండడంతో ఎన్నో ఇన్ఫెక్షన్లు, రక్తస్రావానికి అడ్డుకట్ట వేస్తుంది. ఎండు ఖర్జూరం తినడం వల్ల కూడా బోలెడు లాభాలున్నాయి. ఖర్జూరం తినడం వల్ల ఉపయోగాలను తెలుసుకుందాం.
ఖర్జూరంలో ఉండే విటమిన్-ఏ, బి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటి సమస్యలకు ఇది అద్భుత ఔషధం. ఇందులో ఉండే బీటా కెరటిన్, ల్యుటీన్, జియాగ్జాంతిన్ అనే రుచికారక యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ను అడ్డుకుంటాయి. ఇలా పెద్దపేగు, ప్రోస్టేట్, రొమ్ము, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తులు, క్లోమ క్యాన్సర్లకు అడ్డుకట్ట వేస్తాయి. ఇందులో ఉండే గుణాలు వృద్ధాప్యంలో రెటీనాను సంరక్షిస్తుంది. అంతే కాదు మన శరీరంలో కణాల ఎదుగుదలకు అవసరమైన పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. గుండెపోటు, రక్తపోటు నియంత్రణకు పొటాషియం దోహదపడుతుంది. ఖర్జూరంలో ఐరన్ కూడా అధిక మోతాదులో ఉంటుంది. ఫలితంగా రక్త హీనత బారిన పడకుండా సాయపడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa