ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్: కోహ్లీ స్థానంలో ఆర్సీబీ పగ్గాలు అతడికేనా

national |  Suryaa Desk  | Published : Tue, Mar 01, 2022, 05:40 PM

క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించే ఐపీఎల్ అతి సమీపంలో ఉంది. నెల కూడా పూర్తి కాకుండానే ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ సారి 10 జట్లు తలపడనున్నాయి. చాలా జట్లకు కెప్టెన్లను ఇంకా ప్రకటించలేదు. మెగా వేలం ద్వారా వివిధ జట్లకు ఆడే ఆటగాళ్లు వేరే జట్లకు మారిపోయారు. దీంతో ఇప్పటి వరకు పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను నియమిస్తూ ఆ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బెంగళూరు జట్టుకు తాను కెప్టెన్‌గా వ్యవహరించబోనని విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు.
 ప్రస్తుతం ఆయన స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టేందుకు ముగ్గురు కీలక ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ కెప్టెన్ రేసులో ఉన్నారు. విదేశీ లీగ్‌లో కెప్టెన్‌గా డుప్లెసిస్ తనదైన ముద్ర వేసుకున్నాడు. మ్యాక్స్‌వెల్ కూడా రేసులో ప్రముఖ పోటీదారుడే. వీరిద్దరూ విదేశీ ఆటగాళ్లు. వీరిద్దరిలో ఒకరిని కెప్టెన్‌గా పెడితే జట్టు కూర్పులో కొంత కష్టం కావొచ్చు. దేశీయ ఆటగాడిని పెట్టాలనుకుంటే దినేష్ కార్తీక్ మంచి ప్రత్యామ్నాయం. ఇప్పటికే కోల్‌కతా కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం డీకే సొంతం. అంతేకాకుండా ఆయన కెప్టెన్సీలో తమిళనాడు జట్టు దేశవాళీ టోర్నీలలో విశేషంగా రాణించింది. దీంతో జట్టు యాజమాన్యం దినేష్ కార్తీక్ వైపు మొగ్గు చూపొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa