ఉక్రెయిన్ ప్రధాన నగరాలను చేజిక్కించుకునేందుకు గత వారం రోజులుగా తీవ్రంగా దాడులు చేస్తున్న రష్యా సేనలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రష్యా సైనిక మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవెట్ స్కీ ఉక్రెయిన్ దాడుల్లో మరణించినట్టు తూర్పు యూరప్ కు చెందిన అతిపెద్ద మీడియా సంస్థ నెక్ట్సా వెల్లడించింది. ఉక్రెయిన్ పై రష్యా సేనలు దండయాత్ర ప్రారంభించాక... జనరల్ స్థాయి అధికారి మరణించడం ఇదే ప్రథమం. ఇప్పటికే రష్యన్ సైనికులు ఉక్రెయిన్ లో తాము ఎవరిపై పోరాడాలో తెలియక తీవ్ర వేదనకు గురవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఉక్రెయిన్ బలగాలు మొక్కవోని పట్టుదలతో పోరాడుతూ తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మేజర్ జనరల్ ఉక్రెయిన్ దాడుల్లో మరణించడం రష్యా సైన్యం ఆత్మస్థైర్యాన్ని బలహీనపర్చుతుందనడంలో సందేహం లేదు. అయితే ఈ విషయంపై రష్యా ఇంకా స్పందించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa