ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాకింగ్ ఇన్సిడెంట్: కుక్కను బలిచ్చి రక్తం తాగిన పిల్లలు

national |  Suryaa Desk  | Published : Thu, Mar 03, 2022, 05:30 PM

ఒరిస్సాలో  ఓ షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. పెట్ డాగ్స్‌తో ఆడుకోవాల్సిన వయస్సున్న ఐదుగురు పిల్లలు.. ఓ కుక్క పిల్లను బలివ్వడం సంచలనం రేపింది. బొలన్​గిర్​ జిల్లా పండారపిటా గ్రామంలో.. స్థానికంగా నిర్వహించే సులియా జాతరకు జంతుబలులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఆ గ్రామానికి చెందిన ఐదుగురు పిల్లలపై ఈ కల్చర్ దుష్ప్రభావం చూపింది. ఈ అంధవిశ్వాసానికి అట్రాక్ట్ అయిన ఆ చిన్నారులు ఓ కుక్కపిల్లను ఊరేగించి, పూజలు నిర్వహించి దానిని అత్యంత దారుణంగా చంపేశారు. ఆ తర్వాత పాశవికంగా దాని రక్తాన్ని తాగారు. ఇది గమనించిన పలువురు గ్రామస్థులు పిల్లలను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. రేబిస్​ వ్యాక్సిన్​ ఇచ్చిన డాక్టర్లు.. ప్రజంట్ పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa