ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలి టెస్టులో భారత్ భారీ విజయం

national |  Suryaa Desk  | Published : Sun, Mar 06, 2022, 04:29 PM

శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ భారీ విజయం సాధించింది. ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 174 పరుగులకే పరిమితమై ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక జట్టు రెండో ఇన్నింగ్స్ లో 178 పరుగులకే ఆలౌట్ అయ్యింది. శ్రీలంక బ్యాట్స్ మెన్ లలో డిక్వెల్ల 51, ధనుంజయ 30 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్ 4, జడేజా 4, షమీ 2 వికెట్లు పడగొట్టారు. అంతకముందు భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 574 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ లో టెస్టుల్లో ఆల్ టైమ్ లీడింగ్ వికెట్ టేకర్స్‌ జాబితా టాప్​ -10 ​లోకి​ అశ్విన్ ప్రవేశించాడు. రంగనా హెరాత్​ తో (433 వికెట్లు- శ్రీలంక) కలిసి 10వ స్థానంలో నిలిచాడు. అశ్విన్​ తన టెస్టు కెరీర్​లో అత్యధికంగా బెన్​ స్టోక్స్​ను 11 సార్లు ఔట్​ చేశాడు. డేవిడ్​ వార్నర్​ ను 10 సార్లు, అలిస్టర్​ కుక్​ ను 9 సార్లు, టామ్​ లాథమ్​ ను 8 సార్లు, ఎడ్​ కొవాన్​, అండర్సన్​, తిరిమాన్నెలను తలో 7 సార్లు పెవిలియన్ ​కు పంపాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa