ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరప్రదేశ్‌లో దారుణం

national |  Suryaa Desk  | Published : Mon, Mar 21, 2022, 01:10 PM

ఉత్తరప్రదేశ్‌లో ఈ దారుణం జరిగింది. ప్రతాప్‌ఘర్ జంక్షన్‌లో ట్రైన్ ఎక్కేందుకు ఓ భార్యభర్తలు వచ్చారు. ట్రైన్‌ రావడానికి ఇంకా సమయం ఉండటంతో భార్య ఆకలి వేస్తోందని అడిగింది. ఆమెకు తినడానికి ,తాగడానికి ఏవైనా తీసుకొద్దామని రైల్వేస్టేషన్‌ బయట ఉన్న షాపు దగ్గరకు వెళ్లాడు యువకుడు. భర్త వచ్చే వరకు బాధితురాలి రైల్వే స్టేషన్‌లోని వెయిటింగ్ రూమ్‌ లో కూర్చుంది. తెల్లవారు జామున 4గంటల సమయం కావడంతో మధ్యలో ఆమె కాళకృత్యాలు తీర్చుకునేందుకు రైల్వే స్టేషన్‌లోని పబ్లిక్ టాయిలెట్‌ కి వెళ్లింది. అక్కడే ఆమె కోసం కాచుకొని కూర్చున్న కామాంధులు బలత్కారం చేశారు. బాధిత మహిళ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోగానే అక్కడి నుంచి పారిపోయారు. తినడానికి ఏమైనా తెచ్చేందుకు వెళ్లిన భర్త తిరిగి వచ్చేలోగా వెయిటింగ్ రూమ్‌లో తన భార్య కనిపించకపోవడంతో షాక్ అయ్యాడు భర్త. మరుగుదొడ్డి దగ్గరకు వెళ్లడంతో అక్కడే అపస్మారకస్థితిలో పడివున్న భార్యను చూసి ఆశ్చర్యపోయాడు. బాధిత మహిళ స్పృహలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. యువకుడు రైల్వే స్టేషన్ బయటకు వెళ్లిన సమయంలో మహిళ మరుగుదొడ్లోకి వెళ్లడం చూసిన స్వీపర్ అతని సోదరుడు భార్య తనపై అత్యాచారం చేసి పారిపోయారని తెలిసి షాక్ తిన్నాడు.


భార్య చెప్పిన షాకింగ్ న్యూస్ విన్న భర్త ఆమెను వెంటపెట్టుకొని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రయాణికురాలిపై అఘాయిత్యం చేసింది టాయిలెట్స్ క్లీన్ చేసే సిబ్బంది కావడంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈకేసులో ప్రయాణికురాలిపై అత్యాచారం చేసింది టాయిలెట్స్ క్లీన్ చేసే వ్యక్తి సోదరుడు కావడంతో అతనిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. అన్నకు సహాకరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. పట్టపగలు అది కూడా వేలాది మంది ప్రయాణికులు ఉండే రైల్వే స్టేషన్‌ ఆవరణలోనే మహిళా ప్రయాణికురాలిపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, తోటి ప్రయాణికులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa