మహారాష్ట్రలోని పుణెలో ఒక్క పిల్లి వల్ల 60 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పింప్రిలోని మహా ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్ లోని ట్రాన్స్ఫార్మర్ పైకి ఓ పిల్లి ఎక్కింది. షార్ట్ సర్క్యూట్ తో అది చనిపోయింది. దీని వల్ల భోసరీ, భోసరీ ఎంఐడీసీ, ఓకుర్ది ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సుమారు 60వేల కుటుంబాలపై ఈ ప్రభావం పడింది. పవర్ కట్ ద్వారా తమ వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, సుమారు రూ.100 కోట్ల నష్టం వాటిల్లిందని పింప్రి-చించ్వడ్ సూక్ష్మ పరిశ్రమల సంఘం అధ్యక్షుడు సందీప్ బెల్సేర్ పేర్కొన్నారు. పవర్ కట్ మరో 2 రోజుల వరకు కొనసాగవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ప్రజలు విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని, ఒకే ట్రాన్స్ఫార్మర్ పై లోడ్ మొత్తం పడుతుందని ఎంఎస్ఈడీసీఎల్ అధికారి జ్యోతి చిప్టే తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa