ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకి లిక్కర్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాకూడదు , వస్తే అక్క చెల్లెమ్మలకి మేలు చేస్తాడు ఆలా చెయ్యకూడదు అనే ఆలోచనలు ఉన్నాయి అని అన్నారు. దీనిపై స్పందించిన టీడీపీ నాయకులూ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ అమ్మలారా చూసారా ? మీ ఇంట్లో వాళ్ళు తాగితేనే అమ్మఒడి ఇస్తాడు అంట. రోజుకి ఒక క్వార్టర్ జే-బ్రాండ్ రూ.200 పెట్టి తాగితే,నెలకు రూ.6 వేలు అవుతాయి. ఏడాదికి రూ.72 వేలు అవుతాయి.కానీ మీకు ఇచ్చే అమ్మ ఒడి కేవలం రూ.14 వేలు. ఇప్పుడు అర్ధమైందా,ఎలా మీ తాలిబోట్లు తెంపి,మీకు అమ్మఒడి ఇస్తున్నాడో ? అని ప్రజలకి తెలియచేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa