ట్రెండింగ్
Epaper    English    தமிழ்

72 మంది ఎంపీల పదవీ విరమణ

national |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 11:56 AM

వచ్చే మూడు నెలల్లో రిటైర్ కాబోతోన్న రాజ్యసభ ఎంపీలకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు వీడ్కోలు విందు ఇవ్వనున్నారు. మొత్తం 72 మంది ఎంపీలను ఫేర్వెల్ పార్టీకి ఆహ్మానించారు. దీంతో గురువారం సభలో జీరో అవర్ లేదా ప్రశ్నోత్తరాల సమయం ఉండదని భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు ప్రకటించారు. వెంకయ్య నాయుడు నివాసంలో ఈ వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. ఈ విందుకు వెంకయ్య నాయుడుతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేతలు కూడా హాజరుకాబోతున్నారు. ఈ సందర్భంగా వారు ప్రసంగించనున్నారు. పదవీ విమరణ చేస్తున్న 72 మంది ఎంపీలతో పాటు ఇప్పటికే పదవీ విరమణ చేసిన 19 మంది సభ్యులకు జ్ఞాపికలను అందజేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa