ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసైనికుడికి లక్ష రూపాయలు ఆర్ధిక సాయం చేసిన జనసేన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 12:39 PM

గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం గ్రామానికి చెందిన జనసైనికుడు శ్రీ షేక్ ఖాదీర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ ఆర్ధిక పరిస్థితి సరిగా లేనందున శ్రీ షేక్ ఖాదీర్ వైద్య ఖర్చుల నిమిత్తం జనసేన పార్టీ తరఫున లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందించారు. హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మొత్తాన్ని పార్టీ  రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెక్ రూపంలో ఖాదీర్ సోదరుడు శ్రీ ఖాజావలికి అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐ జనసైనికులు తమవంతు సహకారం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa