పాకిస్తాన్ లో రాజకీయ దుమారం కొనసాగుతోంది. పాకిస్థాన్ దిగువ సభలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రసాభాస చోటుచేసుకుంది. చర్చ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. విపక్షాలకు చెందిన 172 మందికి పైగా సభ్యులు సభకు హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానంపై చర్చను కొనసాగించాల్సిందేనంటూ వారు పట్టుబట్టారు. "గో ఇమ్రాన్ గో" అంటూ నినాదాలతో సభను హోరెత్తించారు. అయితే, డిప్యూటీ స్పీకర్ చర్చకు అర్థాంతరంగా తెరదించారు. సభను ఏప్రిల్ 3కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు సభ పునఃప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఓవైపు సొంత పార్టీలో అసమ్మతి రాగం, మిత్రపక్షాలు కూడా దూరమవుతున్న తరుణంలోనూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. చివరి బంతి వరకు పోరాడతానంటూ తన క్రికెట్ స్ఫూర్తిని చాటే ప్రయత్నం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa