ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు పంజాబ్‌తో కోల్‌కతా ఢీ

national |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 07:13 AM

వాంఖడే స్టేడియంలో నేడు(శుక్రవారం) పంజాబ్ కింగ్స్ జట్టుతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తలపడనుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైపై గెలిచినా, బెంగళూరుతో జరిగిన పోరులో కోల్‌కతా పరాజయం పాలైంది. ఫాస్ట్ బౌలర్లు టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్ ఐదు వికెట్లు తీసి బెంగుళూరు టాప్-ఆర్డర్‌ను దెబ్బతీశారు. అయితే 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా బ్యాటర్లు ఛేదించలేకపోయారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు అజింక్యా రహానే, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్ వరుణ్ చక్రవర్తి రాణించాల్సి ఉంది. పంజాబ్ కింగ్స్ జట్టులో కెప్టెన్ మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, భానుక రాజపక్సతో కూడిన టాప్ ఆర్డర్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. వారికి తోడు ఓడియన్ స్మిత్, షారుఖ్ ఖాన్ చెలరేగితే పంజాబ్ విజయం ఖాయం అవుతుంది. జట్టులో దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ కగిసో రబడా చేరుతుండడం ఆ జట్టుకు సానుకూలాంశం. ఏదేమైనా ఇరు జట్ల మధ్య ఈ రోజు రాత్రి 7.30కి ప్రారంభమ్యే పోరు ఉత్కంఠను పెంచుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa