కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ మా మీద తప్పుడు కేసులు బనాయించడం వల్లనే నేను రాజ్యసభకు రాగలిగానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి తెలిపారు. ఆయన పదవి కాలం రెండు నెలల్లో పూర్తి అవుతున్న సందర్భంగా మిగిలిన రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు పలికేందుకు గురువారం రాజ్యసభలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసి , ఇప్పటి వరకు నన్ను నడిపించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ చైర్మన్గా క్రమశిక్షణ, విలువలను, సభా మర్యాదను కాపాడేందుకు కృషి చేస్తున్న మీ నాయకత్వంలో ఈ సభలో సభ్యుడిగా కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన ఎం.వెంకయ్యనాయుడని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa