రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా మెరుగైన సేవలు అందించేలా సిబ్బంది కృషి చేయాలని జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. గురువారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయంలో గల సచివాలయాన్ని ఆయన ఇన్ చార్జి ఆర్డీఓ జీ సువర్ణమ్మ, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబులతో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందిని పలు రకాల ప్రశ్నలు వేసి ఏ విధంగా విధులు నిర్వర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు అందచేశారు. ప్రజలకు అందచేస్తున్న సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు అధికారుల సమన్వయంతో సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో నిర్మించి ఉన్న టిడ్కో గృహాలను ఆయన అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా గృహాల వద్ద పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు, లబ్దిదారుల నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం జరిగేలా చూడాలని, సాధ్యమైనంత త్వరగా లబ్దిదారులకు టిడ్కో గృహాలు అందించేలా చూడాలని ఆదేశించారు.
అనంతరం వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నిర్మాణంలో ఉన్న గృహాలను పరిశీలించి లబ్దిదారులతో మాట్లాడారు. మౌళిక వసతుల కల్పన, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయల గురించి నిర్మాణాలు చేపడుతున్న అడిగి తెలుసుకున్నారు. త్వరగా గృహాలు నిర్మించుకునేలా లబ్దిదారులకు అవగాహన కల్పించాలని అన్నారు. వారి వెంట టీపీఓ చంద్రశేఖర్, సచివాలయ అడ్మిన్ ప్రసాద్, వార్డు ఎమినిటి ప్రశాంత్, వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రమీల, ఎడ్యుకేషన్ సెక్రటరి రావుల మంజుల, వీఆర్ఓ విజయలక్ష్మి, మహిళా పోలిసు షెహనాజ్, ప్లానింగ్ సెక్రటరి సురేంద్ర తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa