ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిడిపి ప్రభుత్వంలో మహిళలకు పెద్ద పీట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 04:19 PM

రాబోయే టిడిపి ప్రభుత్వంలో మహిళలకు పెద్ద పీట వేస్తామని కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు. శుక్రవారం కావలి పట్టణంలోని 8వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. ముందుగా నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి వార్డు పర్యటనను మొదలు పెట్టారు.


ఒక మహిళ ఆవేదన విని సానుకూలంగా స్పందించి ఆమెకు ధైర్యం ఇచ్చి రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో ముందుగా మహిళలకు పెద్దపీట వేస్తామని తెలియజేశారు. అనంతరం షమ్మి అనే పసిపాపకు గుండె ఆపరేషన్ అవసరం అని తెలుసుకుని వారిని పరామర్శించి, ఆర్థికంగా సహాయం చేసి త్వరలోనే చికిత్సకు అవసరమయ్యే చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో వార్డులోని సమస్యలపై చర్చించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa