ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..

national |  Suryaa Desk  | Published : Mon, Apr 04, 2022, 01:50 PM

ట్రిపుల్ ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గత నెల 25 న విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ని అందుకుంది. అన్ని సినిమాల రికార్డు లకు బ్రేక్ ఇస్తూ 710 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది.నిన్నటితో ఈ సినిమా పూర్తయి తొమ్మిది రోజులు పూర్తి అవడం తో పథ రికార్డులు అన్ని క్రాస్ చేసింది.ఎన్టీఆర్ రాంచరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన పీరియాడిక్ ఆక్షన్ డ్రామా ట్రిపుల్ ఆర్. అయితే తాజాగా ఈ సినిమా పై రాజకీయ నేతలు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమా బారి వసూళ్లపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా స్పందించారు. ట్రిపుల్ ఆర్ సినిమా వసూళ్లతో రికార్డులు సృష్టించినట్లే భారత ఆర్థిక వ్యవస్థ కూడా రానున్న రోజుల్లో రికార్డు సృష్టిస్తుందని జోశ్యం చెప్పారు. 2021 – 2022 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఎగుమతి సంఖ్య 418 బిలియన్లకు చేరుకోవడం పై వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ హర్షం వ్యక్తం చేసారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa