దేశంలో కామాంధుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న మరదలిపై ఓ దుర్మార్గుడు కన్నేశాడు. ఎన్ని రోజులు వెంటపడినా తన కోరిక తీర్చలేదని పగతో రగిలిపోయాడు. ఆ మహిళను ఏడాదిన్నర పాపతో సహా పెట్రోల్ పోసి, సజీవ దహనం చేశాడు. ముక్కుపచ్చలారని ఆ చిన్నారి తన తల్లితో సహా మంటల్లో కాలిబూడిదైంది. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తమిళనాడులోని దిండిగల్ జిల్లా నాధం గ్రామంలో అంజలి (22)కి శివకుమార్తో కొన్నేళ్ల క్రిందట పెళ్లి జరిగింది. వీరికి ప్రస్తుతం ఏడాదిన్నర పాప మలర్విజి ఉంది. శివ దినసరి కూలీగా పని చేస్తుండగా, అంజలి గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తున్నారు. పెళ్లైన నాటి నుంచి వీరంతా ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటున్నారు. శివ సోదరుడు కరుపయ్య (30) తరచూ అంజలితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. కొన్నాళ్లకు తన కోరిక తీర్చాలని ఇబ్బంది పెట్టేవాడు. లైంగిక వేధింపులకు గురి చేసినా, అతడి దుర్మార్గాలను అంజలి ఓపికతో భరించింది.
ఈ క్రమంలో శనివారం ఆమె భర్త శివ కూలికి వెళ్లాడు. ఇక అంజలి ఎప్పటిలాగానే కుమార్తెను తీసుకుని, గొర్రెలను మేపేందుకు బయటకు వెళ్లింది. ఆమెను అనుసరించిన నిందితుడు కరుపయ్య ఎవరూ లేని చోట అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడి చర్యలను అంజలి ఎదిరించింది. దీంతో పట్టరాని కోపంతో అంజలితో పాటు ఆమె కుమార్తెను తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తల్లీకూతుళ్లు సజీవ దహనం అయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడిని తీవ్రంగా కొట్టారు. శివ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడిని అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa