ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వడ్డీ రేట్లు తగ్గించిన పీఎన్ బీ...కష్టమర్లకు చేదువార్తే

national |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 01:39 PM

తన బ్యాంకులోని సేవింగ్ మొత్తాలపై పీఎన్బీ వడ్డీ రేట్లను తగ్గించింది. ఇలా పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) తన కస్టమర్లకు మరోసారి బ్యాడ్‌న్యూస్ చెప్పింది. చెక్ పేమెంట్ల కోసం నేటి నుంచే పాజిటివ్ పే విధానాన్ని అమలు చేస్తోన్న పీఎన్‌బీ.. అటు సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తగ్గించిన వడ్డీ రేట్లు నేటి నుంచే(ఏప్రిల్ 4, 2022) అమల్లోకి వస్తున్నాయి. రూ.10 లక్షల కంటే తక్కువున్న సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై ఏడాదికి 2.70 శాతం వడ్డీనే పీఎన్‌బీ ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. రూ.10 లక్షల పైనుంచి రూ.500 కోట్ల వరకున్న సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్‌లపై కూడా వడ్డీ రేటు 2.75 శాతానికి తీసుకొచ్చింది. ఫిబ్రవరిలోనే పీఎన్‌బీ సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. రూ.10 లక్షల కంటే తక్కువున్న మొత్తాలపై 2.75 శాతం వడ్డీని అందిస్తుంది. అలాగే రూ.10 లక్షల పైబడిన రూ.500 కోట్ల కంటే తక్కువున్న మొత్తాలకు 2.80 శాతం ఆఫర్ చేస్తుంది. ప్రస్తుతం ఈ రేట్లను మరోమారు తగ్గించింది.


దేశీయ, ఎన్‌ఆర్ఐ సేవింగ్ అకౌంట్ డిపాజిట్ల వడ్డీ రేట్లు..


రూ.10 లక్షల కంటే తక్కువున్న సేవింగ్ ఫండ్ అకౌంట్‌కు.. ఏడాదికి 2.70 శాతం వడ్డీ రేటు


రూ.10 లక్షలు, ఆపైబడిన సేవింగ్ ఫండ్ అకౌంట్ బ్యాలెన్స్‌లకు.. ఏడాదికి 2.75 శాతం


అంతేకాక నేటి నుంచి రూ.10 లక్షలకు పైబడిన చెక్ పేమెంట్లకు పీఎన్‌బీ పాజిటివ్ పే సిస్టమ్‌ను అమలు చేస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై తన వెబ్‌సైట్‌లో, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కస్టమర్లకు అలర్ట్ ఇచ్చింది. తప్పనిసరిగా కస్టమర్లు ఈ విధానాన్ని పాటించాలని పేర్కొంది. పాజిటివ్ పే విధానాన్ని చెక్ మోసాలను తగ్గించేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. ఈ విధానాన్ని బ్యాంకులు తప్పనిసరిగా అమల్లోకి తీసుకురావాలని ఆర్‌బీఐ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa