ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరగనున్న ఏసీల ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 09:47 AM

ఏసీల ధరలు పెరగనున్నాయి. ముడి సరుకుల ధరలు పెరిగిపోవడంతో కంపెనీలు ధరలు పెంచాలనుకుంటున్నాయి. ఈ వేసవి సీజన్‌ లో అమ్మకాలు రెండంకెల స్థాయిలో పెరుగుతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. అందుకే తయారీ భారాన్ని తగ్గించుకునేందుకు ఉత్పత్తుల ధరలను 5 శాతం వరకు పెంచాలనుకుంటున్నాయి.
గత రెండు వేసవి సీజన్లలో కరోనా కారణంగా ఏసీల అమ్మకాలు ఆశించిన మేర లేవు. దీంతో అప్పుడు నిలిచిన డిమాండ్‌ కూడా తోడయ్యి, ఈ సీజన్‌ లో అమ్మకాలు జోరుగా ఉండొచ్చని వోల్టాస్, హిటాచి, ఎల్‌జీ, ప్యానాసోనిక్, గోద్రేజ్‌ అప్లయన్సెస్‌ అంచనా వేస్తున్నాయి. ఏసీల తయారీలో వినియోగించే అల్యూమినియం, కాపర్‌ ధరలు గణనీయంగా పెరగడంతో ధరలను పెంచడం తప్పేలా లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa