ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరగడుపునే గోరువెచ్చని నీటిని తాగుతున్నారా...!

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 09:31 PM

ప్రతీ రోజూ ఉదయం నిద్ర లేవగానే పరగడుపున మంచినీళ్లను తాగమని పెద్దోళ్ళు చెబుతుంటారు. అది కూడా గోరు వెచ్చని నీళ్లను తాగితే అనేక లాభాలు పొంద‌వ‌చ్చు. అంతర్గత అవయవాలు శుభ్రమవుతాయి. మలబద్దకం సమస్య నుండి విముక్తి పొందవచ్చు. శరీర జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. క్యాలరీలు త్వరగా ఖర్చయి శరీరంలో ఉండే కొవ్వు కూడా తగ్గుతుంది. 


ఉద‌యంపూట ప‌ర‌గ‌డుపునే క‌నీసం 3 గ్లాసుల గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంత మోతాదులో నీళ్ల‌ను తాగితేనే లాభాలు క‌లుగుతాయంట మరి.  దీంతో ఉదయం పూట మన శరీరంలో అధికంగా ఉండే యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయి. దీని వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. కనుక తప్పకుండా పరగడుపునే మూడు గ్లాసుల నీళ్లను తీసుకోండి. అయితే కొంతమంది పరగడుపునే నీటిని తాగలేరు. వామిటింగ్ సెన్సేషన్ కలుగుతుంది. అలాంటివారు  కొద్ది కొద్దిగా తాగ‌డం అల‌వాటు చేసుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa