ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిందితుల ఇండ్లను కూల్చిన..మధ్య ప్రదేశ్ సర్కార్

national |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 01:53 AM

నిందితుల ఇండ్లను కూల్చి మధ‌్యప్రదేశ్ సర్కార్ సైతం యూపీ సర్కార్ బాటలో నడుస్తోంది. ఇదిలావుంటే శ్రీరామ నవమి ఊరేగింపు సందర్భంగా దాడులకు పాల్పడిన నిందితుల చెందిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఆదేశాలు జారీచేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నిందితులకు చెందిన ఇల్లు, దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. సోమవారం ఏకంగా 16 ఇల్లు, 29 దుకాణాలను కూల్చివేసినట్టు తెలిపారు. ఖర్గోన్‌లో నవమి ఊరేగింపు సందర్భంగా మత ఘర్షణలు చెలరేగడంతో అధికారులు ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.


ఇండోర్ డివిజనల్ కమిషన్ పవన్ శర్మ మాట్లాడుతూ.. ‘‘రామ నవమి ఊరేగింపు సందర్బంగా రాళ్లు రువ్వినవారి ఆస్తులను ధ్వంసం చేయాలని ఖర్గోవ్ అధికార యంత్రాంగం నిర్ణయించింది.. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.. 84 మంది నిందితులను అరెస్ట్ చేశారు.. ఖర్గోన్‌లో కర్ఫ్యూ విధించారు’’ అని అన్నారు. ఖర్గోన్‌లోని మోహన్ టాకీస్ సమీపంలో నాలుగు ఇల్లు, మూడు దుకాణాలు... ఖస్ఖాస్ బడీ ప్రాంతంలో 12 ఇల్లు, 10 దుకాణాలు.. ఔరంగపూర్ ఏరియాలో మూడు దుకాణాలు, తలాబ్ చౌక్ వద్ద 12 షాపులను కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. అలాగే, ఖర్గోవ్ గణేశ్ ఆలయం వద్ద దాదాపు 16 అక్రమ నిర్మాణాలను ధ్వంసం చేశామని చెప్పారు.


ఆదివారం రామ నవమి శోభాయాత్రపై ఓ వర్గానికి చెందిన వ్యక్తులు రాళ్లు రువ్వడంతో పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. శోభాయాత్ర ప్రారంభమైన కొద్ది సేపటికే ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణల్లో నాలుగు ఇళ్లకు అల్లరి మూకలు నిప్పంటించాయి. దీంతో తలాబ్ చౌక్, గోశాల మార్గ్, మోతిపుర ప్రాంతాల్లో పరిస్థితిని అదుపు చేయడానికి కర్ఫ్యూను విధించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్.. దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.


అంతేకాదు, ప్రజా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన నిందితుల నుంచే నష్ట పరిహారం వసూలు చేస్తామని స్పష్టం చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లో బుల్జోజర్ పేరు వింటే నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తప్పు చేస్తే ఏ క్షణంలో బుల్డోజర్లు తమ ఇంటి ముందుకు వస్తాయోమననే భయం వారిని వెంటాడుతోంది. తాజాగా, ఈ బుల్డోజర్ మధ్యప్రదేశ్‌‌లోకి ప్రవేశించడంతో అక్రమార్కులు హడలెత్తిపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa