ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్‌టిసి బస్సు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 02:34 PM

 ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు కుదేలవుతోన్న వేళ .. మరో అదనపు భారం ప్రజలపై పడనుంది. రాష్ట్రంలో ఆర్‌టిసి బస్సు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.డీజిల్‌ ధరలు పెరిగిన వేళ ... బస్సు ఛార్జీలను పెంచేందుకు ఆర్‌టిసి చర్యలు చేపట్టినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రతిపాదనల దస్త్రాన్ని ఆర్‌టిసి అధికారులు వారం క్రితమే సిద్ధం చేసి సిఎం జగన్‌ వద్దకు పంపినట్లు తెలిసింది. ఆర్‌టిసి చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి, ఎండి ద్వారకా తిరుమలరావు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో ఆర్‌టిసి బస్సు ఛార్జీల పెంపుపై ప్రకటన చేసే అవకాశముంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa