బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ ఆటలో ఎన్నో ఘనతలను సొంతం చేసుకుంది. అంతే స్థాయిలో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో కేన్సర్ బాధిత చిన్నారులకు అండగా ఆమె నిలిచారు. రూ.లక్ష విరాళాన్ని తన వంతుగా అందించారు. ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ నిర్వహించనున్న వైటథాన్ రన్ టీ - షర్ట్ను ఆమె మంగళవారం ఆస్పత్రిలో ఆవిష్కరించారు. మూడేళ్లలోపు పిల్లలను కంటి కేన్సర్ నుంచి కాపాడే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు.
ఆసుపత్రి వ్యవస్థాపకుడు, ట్రస్టు బోర్డు చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావు మాట్లాడారు. చిన్నారుల కంటి సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. కంటి కేన్సర్తో బాధపడుతున్న పిల్లల చికిత్సకు అవసరమైన నిధులను సేకరిస్తున్నట్లు చెప్పారు. దీని కోసమే వైట్థాన్ రన్ చేపట్టినట్లు వెల్లడించారు. మే 8న నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ఈ రన్ ప్రారంభమవుతుందన్నారు. ఇందులో పాల్గొనదల్చినవారు "https://www.ifinish.in/event_details/Whitathon_" లో పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa