ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రగ్స్ కలకలం.. గత 24 గంటల్లో 104 మంది అరెస్టు

national |  Suryaa Desk  | Published : Thu, Apr 21, 2022, 08:24 PM

డ్రగ్స్ వల్ల చాలా మంది పాడైపోతున్నారు. యువత ఎక్కువగా ఈ వ్యసనాలకు అలవాటు పడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. తాజాగా డ్రగ్స్ సరఫరా వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు 104 మందిని అరెస్టు చేయడం కలకలం రేపింది. గత 24 గంటల్లో దోపిడీ, స్నాచింగ్, మద్యం స్మగ్లింగ్ కేసుల్లో 104 మందిని అరెస్టు చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు.

నిందితుల నుంచి 69 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇంకా 15 మంది ప్రకటిత నేరస్థులను కూడా అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa