ఒడిశాలోని భువనేశ్వర్లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యతో పాటు ఆమె చెల్లెలిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాలను ఇంట్లో దాచి పెట్టాడు. ఈనెల 21న ఈ జంట హత్యలు జరగగా, ఆలస్యంగా వెలుగుచూసినట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. భువనేశ్వర్లోని చంద్రశేఖర్పుర్ హౌసింగ్ బోర్డు కాలనీలో భార్య, మరదలిని అత్యంత దారుణంగా హత్యచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిజయ్కేతన్ అనే వ్యక్తి తన భార్య గాయత్రితో పాటు ఆమె చెల్లెలు సరస్వతిని హతమార్చాడు. మృతదేహాలను ఇంట్లో దాచాడు. ప్రతి రోజు వచ్చి ఇంట్లోని మృతదేహాలను చూసి వెళ్లేవాడు. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తుంటే మృతులు గాయత్రి, సరస్వతి మొబైల్స్ స్విచ్చాఫ్ వచ్చేవి. నిందితుడు బిజయ్కేతన్కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేవాడు కాదు. ఇంట్లోంచి వస్తున్న దుర్వాసనతో ఇరుగు పొరుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ తగాదాల కారణంగానే నిందితుడు ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
బిజయ్కేతన్, గాయత్రి దంపతులకు 2011లో వివాహం జరిగింది. గాయతి చెల్లెలు సరస్వతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అప్పుడప్పుడు గాయత్రి వాళ్ల ఇంటికి వస్తుండేది. అలా ఈసారి వచ్చి హత్యకు గురైంది. దీంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డలకు న్యాయం చేయాలని మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa