ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్‌లో శిఖర్ ధావన్ సరికొత్త రికార్డు

sports |  Suryaa Desk  | Published : Tue, Apr 26, 2022, 09:41 AM

ఐపీఎల్‌లో తన 200వ మ్యాచ్‌ను చెన్నైతో ఆడిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శిఖర్ ధావన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో 6000 పరుగుల మార్కును దాటాడు. విరాట్‌ కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌‌గా ధావన్‌ నిలిచాడు. ఐపీఎల్-2022 సీజన్‌లో ధావన్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి, 214 పరుగులు చేశాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో అభిమానులు గబ్బర్‌గా పిలుచుకునే శిఖర్ ధావన్ చెలరేగి ఆడాడు. 88 పరుగులుతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా ధావన్ ట్వంటీ 20 క్రికెట్‌లో 9000 పరుగుల మార్కును కూడా అధిగమించాడు. కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన మూడవ భారతీయుడు అయ్యాడు.


ధావన్ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 675 బౌండరీలు సాధించాడు. అతను ఐపీఎల్‌లో మొత్తం 45 అర్ధశతకాలు నమోదు చేశాడు. ఈ జాబితాలో అతడి కంటే ముందు స్థానంలో వార్నర్ ఉన్నాడు. వార్నర్ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 52 అర్థ శతకాలు నమోదు చేసి, అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక తన ఫామ్‌తో సెలెక్టర్లకు తాను రేసులోనే ఉన్నానని శిఖర్ ధావన్ సంకేతాలిచ్చాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌‌లో ఆడాలని శిఖర్ భావిస్తున్నాడు. అయితే సెలెక్టర్ల ఆలోచన ఎలా ఉంటుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa