అరాచక పాలనలో మహిళలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారు. దాడికి గురైన ఒక యువతికి న్యాయం చేయాలని పోరాడుతుండగానే ఇంకో మహిళ పై అఘాయిత్యం జరుగుతోంది అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ ఆవేదన వ్యక్తపరిచారు. గుంటూరు జిల్లాలో జరిగిన రేప్ మరియు హత్యకు గురి కాబడిన విషయం పై స్పందిస్తూ.. రేపిస్టులని ఉరి తియ్యాల్సిన ప్రభుత్వం, బాధిత కుటుంబాలకి మద్దతుగా నిలిచేవారికి నోటీసులు ఇస్తూ కేసులు నమోదు చేస్తూ తాలిబన్ల పాలనని తలపిస్తోంది. గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గం, దుగ్గిరాల మండలం, తుమ్మపూడిలో మహిళపై హత్యాచారం దారుణం. సామూహిక అత్యాచారానికి పాల్పడి బలిగొన్న మృగాళ్లని కఠినంగా శిక్షించాలి. అత్యాచారాలు, హత్యలతో బరితెగించిన నిందితులని ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేస్తుండడం వల్లే నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. వైసీపీ పాలనలో ఇప్పటివరకు 800 మందికి పైగా మహిళలపై అఘాయిత్యాలకి పాల్పడిన మానవ మృగాలలో ఒక్కరికైనా శిక్ష పడి వుంటే ఇలాంటి నేరస్తులకు భయం పుట్టేది అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa