ఇండియన్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందించింది. వేసవి సందర్భంగా వివిధ ప్రాంతాలకు 574 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఇవి ఏప్రిల్ నెలాఖరు నుంచి జూన్ వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇందులో తిరుపతి-హైదరాబాద్, తిరుపతి-ఔరంగాబాద్ మధ్య 20 ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఈనెల 30 నుంచి వీకెండ్స్ లో స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయని అధికారులు చెప్పారు.
హైదరాబాద్-తిరుపతి (07509) రైలు శనివారం సాయంత్రం 4.35కు హైదరాబాద్ నుంచి బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 5.30 గంటలకు తిరుపతి చేరుకుంటుందని వెల్లడించారు. ఈ రైలు ఏప్రిల్ 30, మే 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఇక తిరుపతి-హైదరాబాద్ రైలు (07510) మంగళవారం 11.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్ కి చేరుకుంటుందని వెల్లడించారు. ఈ రైలు మే 3, 10, 17, 24, 31 తేదీల్లో అందుబాటులో ఉండనుంది.
తిరుపతి-ఔరంగాబాద్ (07511) రైలు ఆదివారం ఉదయం 07.05 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుందని, మరుసటి రోజు 7 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుందని వెల్లడించారు. ఇది మే 1, 8, 15, 22, 29 తేదీల్లో నడుస్తుందని చెప్పారు. ఔరంగాబాద్ (07512) నుంచి సోమవారం రాత్రి 11.15 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 10.15 గంటలకు తిరుపతి చేరుకుంటుందని తెలిపారు. ఇది మే 2, 9, 16, 23, 30 తేదీల్లో అందుబాటులో ఉండనుంది. ఇవి సత్తెనపల్లి, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర మీదుగా వెళ్తాయని చెప్పారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa