ఈ మధ్య కాలంలో మారుతున్న జీవనవిధానంతో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మనం డైట్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ముఖ్యంగా మన రోజువారీ డైట్ లో అరటిపండు ఉండేలా జాగ్రత్త పడాలని వైద్యులు సూచిస్తున్నారు.ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు అరటిపండు తినొచ్చా లేదా అని సందేహపడుతుంటారు. అరటిపండు పండకుండా ఉన్నప్పుడు తినడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకి మేలు జరుగుతుందని పరిశోధనలో వెల్లడయింది. మధుమేహ సమస్య ఉన్నవాళ్లు కేవలం పండనివి, లేదా కాస్తా పండినవి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అరటి పండులో పీచు పదార్థం అధికంగా ఉండడంతో పాటు కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది.
ఇది ప్రతీ ఒక్కరి ఆరోగ్యానికి అమితమైన మేలు చేస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్, జీర్ణ కోశ సంబంధిత సమస్యలను రాకుండా చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జీర్ణాశయానికి మేలు చేసే బ్యాక్టీరియా ఇందులో అధికంగా ఉంటుంది. దీని కారణంగా జీర్ణ సమస్యలు వెంటనే దూరం అవుతాయి. ఇంకా అనేక రకాల సమస్యల నుండి ముందు మనల్ని రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa