చైనాలో ఓవైపు కరోనా వెంటాడుతుంటే మరోవైపు ప్రమాదాలు ఆ దేశానికి శాపంగా మారుతున్నాయి. చైనాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఎనిమిది అంతస్థుల భవనం కుప్పకూలింది. దాంతో చాలామంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. హునాన్ ప్రావిన్స్లోని చాంగ్షా నగరంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. శిథిలాల కింద 23 మంది చిక్కుకుపోయారు. 39 మంది గల్లంతయ్యారు. ఈ మేరకు స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కొంతమందిని ప్రాణాలతో రక్షించారు.
రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ఐదుగురిని కాపాడినట్టు నగర అధికారులు తెలిపారు. అదేవిధంగా ఎనిమిది అంతస్థుల భవనం కూలిందని అధికారులు నిర్ధారించారు. బాధితులను రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది మెటల్, కాంట్రీట్ స్లాబ్లను తొలగిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరిని ఇరుకైన సందుల నుంచి బయటకు తరలిస్తున్నారు.
అయితే భవనం ఎందుకు కూలిపోయిందనే దానికి స్పష్టమైన కారణాలు తెలియలేదు. అయితే భవనంలో ఉండే వాళ్లు వివిధ స్థాయిల్లో నిర్మాణాత్మక మార్పులు చేశారని, అందుకే ఇలా జరిగిందని కొందరు భావిస్తున్నారు. ఈ విపత్తుకు అసలు కారణాన్ని తెలుసుకునేందుకు అధ్యక్షుడు జిన్పింగ్ సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
ఇదిలావుంటే జనవరిలో గ్యాస్ లీక్ కారణంగా పేలుడు సంభవించింది చాంగ్ కింగ్ నగరంలో ఓ భవనం కూలిపోయింది. ఆ ఘటనలో డజనుకుపైగా ప్రజలు మరణించారు. అలాగే 2021 జూన్ నెలలో షియాన్ నగరంలోని రెసిడెన్షియల్ కాంపౌండ్లో గ్యాస్ పేలుడు సంభవించినప్పుడు 25 మంది ప్రాణాలు కోల్పోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa