ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా సుమన్ బేరీ బాధ్యతల స్వీకరణ

national |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 04:24 PM

నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా సుమన్ బేరీ బాధ్యతలు స్వీకరించారు. ఈ పోస్టు నుంచి రాజీవ్ కుమార్ తప్పుకోవడంతో ఆ బాధ్యతలను సుమర్ బేరీ చేపట్టారు. సుమన్ బేరీ అనుభవజ్ఞుడైన పాలసీ ఎకనామిస్ట్, రీసెర్చ్ అడ్మినిస్ట్రేటర్. ఇంతకు ముందు సుమన్ బేరీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER)డైరక్టర్ జనరల్‌గా సేవలు అందించారు. రాయల్ డచ్ షెల్ గ్లోబల్ చీఫ్ ఎకనామిస్ట్‌గా కూడా పనిచేశారు.


దీంతోపాటు పీఎం ఆర్థిక సలహాదారుల మండలి, స్టాటిస్టికల్ కమిషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాంకేతిక సలహాదారుల కమిటీల్లో సుమన్ బేరీ సభ్యుడిగా ఉన్నారు. ప్రపంచ బ్యాంక్కు సైతం బెరీ సేవలు అందించారు. నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకున్న సుమన్ బేరీ ప్రపంచ అనిశ్చితి సమయంలో నీతి ఆయోగ్ బాధ్యతలు తనకు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఇక్కడ ఆర్థికాభివృద్ధి అంతిమంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధిలో నీతి ఆయోగ్ తనదైన పాత్ర పోషించేందుకు కృషి చేస్తానని సుమన్ బేరీ అన్నారు.


ఇదిలా ఉండగా కొత్త విదేశాంగ కార్యదర్శిగా సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి వినయ్ క్వాత్ర బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. ఏప్రిల్ నాలుగో తేదీ కొత్త విదేశాంగ కార్యదర్శిగా ఐఎఫ్ఎస్ అధికారి వినయ్ మోహన్ క్వాత్రాను కేంద్రం నియమించింది. క్వాత్రా, 1988 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి. హర్షవర్ధన్ ష్రింగ్లా రిటైర్ అయిన తర్వాత విదేశాంగ కార్యదర్శి పదవికి క్వాత్రా నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa