దేశం ముందున్న సవాళ్లను ఎదుర్కోవడమే తన మొదటి థ్యేయమని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు. ప్రస్తుత, భవిష్యత్ భద్రతా సవాళ్లు ఎదుర్కొనేందుకు సైన్యాన్ని మంచి ప్రమాణాలతో తయారు చేయడమే తన ప్రాధాన్యమని ఆయన అన్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆదివారం సౌత్బ్లాక్లో గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు.
ఈ సందర్భంగా "భౌగోళిక రాజకీయ పరిస్థితి వేగంగా మారుతుంది. దీని కారణంగా మన ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. దానిని ఎదుర్కొనే విధంగా ఉండడం భారత ఆర్మీ సైనికుల బాధ్యత." అని మనోజ్ పాండే అన్నారు. దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదని, ఐక్యంగా ముందుకు సాగుతామని పాండే అన్నారు. అలాగే సవాళ్లను, సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు.
"మేమంతా కలసి శిక్షణ పొందాం, మేము కలసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా మళ్లీ కలసి పని చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాం. మూడు సేవల మధ్య సమన్వయం, సహకారం.. ఉమ్మడి విధానానికి సూచన." అని పాండే చెప్పారు. జాతీయ భద్రత విషయంలో త్రివిధ దళాలతో కలసి ముందుకు వెళ్తామన్నారు. అంతే కాదు సవాళ్లను ఎదుర్కొనేందుకు కార్యాచరణ సిద్ధం చేయడం తన బాధ్యత అని అన్నారు. మనోజ్పాండే 29వ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇంజనీర్ కార్ప్స్ ఆఫ్ ఆర్మీ నుంచి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయిన మొదటి అధికారిగా మనోజ్ పాండే నిలిచారు.
గతంలో మనోజ్పాండే డిప్యూటీ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు నిర్వహించారు. ఆర్మీ చీఫ్గా నియామకం అవ్వడానికి ముందు ఆర్మీ తూర్పు కమాండ్కు నాయకత్వం వహించారు. ప్రస్తుతం జనరల్ మనోజ్పాండే ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఆర్మీ చీఫ్గా నేవీ, ఎయిర్ఫోర్స్తో సమన్వయం చేయాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa