పంజాబ్ లోని పాటియాలలో అల్లర్లకు కారణమైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల నుంచి పంజాబ్లోని పాటియాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖలిస్థాన్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం రైట్ వింగ్ చేసిన ర్యాలీ ఘర్షణలకు దారితీసింది. ఆ ర్యాలీ సందర్భంలో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రెండు వర్గాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కత్తులు దూసుకున్నారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. దీంతో కొంతమందికి గాయాలయ్యాయి. ఈ అల్లర్ల కారణంగా అధికారులు కొన్ని గంటలపాటు కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
ఈ ఘర్షణలకు సంబంధించి ప్రధాన నిందితుడు బర్జిందర్ సింగ్ పర్వానాను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. బర్జిందర్ సింగ్ పర్వానాను మొహాలీలో అరెస్టు చేసినట్టు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖ్వీందర్ సింగ్ చినా చెప్పారు. ఈ మేరకు పర్వానాను పాటియాలాలోని కోర్టు ముందు హాజరుపరుస్తామని తెలిపారు. రాజపురాకు చెందిన బర్జిందర్ సింగ్ పర్వానా పాటియాలో శుక్రవారం జరిగిన ఘర్షణలకు కీలక సూత్రధారి అని తెలిపారు. అలాగే హరీష్ సింగ్లా సహచరుడు శంకర్ భరద్వాజ్తోపాటు జగ్గీ పండిట్ను కూడా అరెస్టు చేశామన్నారు.
అయితే బర్జిందర్ సింగ్ పర్వానా గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి. ఈయన వివాదాలకు కొత్తవాడేమి కాదు. సోషల్ మీడియా ద్వారా సిక్కు మిలిటెంట్లకు ప్రసంగాలు చేస్తుంటాడు. ఇప్పటికే ఆయనపై నాలుగు కేసులు ఉన్నాయి. ముఖ్యంగా సిక్కు మిలిటెంట్ జర్నయిల్ సింగ్ బింద్రన్వాలేకు మద్దతుగా వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో 2021 జూలైలో శివసేన నేత సుధీర్ సూరి ఫిర్యాదు మేరకు మొహాలీ పోలీసులు బర్జిందర్ను అరెస్టు చేశారు. అల్లర్లను ప్రేరేపించే విధంగా ప్రసంగించారని, మోసపూరితమైన ప్రకనటలు చేస్తున్నారనే ఆరోపణలతో అప్పట్లో అరెస్ట్ చేశారు. అలా ఇంకొన్ని కేసులు కూడా ఆయనపై ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa