ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రానికి సుప్రీం కోర్టు 24 గంటల డెడ్ లైన్

national |  Suryaa Desk  | Published : Tue, May 10, 2022, 04:59 PM

అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాజ్యాంగంలోని సెక్షన్ 124ఏ దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలపై సుప్రీం కోర్టు స్పందించింది. మంగళవారం దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ సెక్షన్‌ను ఉపయోగించి తమకు వ్యతిరేకంగా గొంతెత్తిన వారిపై రాజద్రోహం కింద ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టం ప్రస్తుతం అమలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఐపీసీ సెక్షన్ 124ఏపై సమీక్ష పూర్తయ్యే వరకు రాజద్రోహం కేసులపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విచారణ నిలిపి వేస్తారా లేదా కొనసాగిస్తారా అనే అంశంపై అభిప్రాయం తెలియజేయాలని కేంద్రానికి 24 గంటల డెడ్‌లైన్‌ను విధించింది.


రాజద్రోహం పిటిషన్‌పై విచారణను నిలిపి వేయాలని సుప్రీం కోర్టును కేంద్రం సోమవారం కోరింది. అయితే మంగళవారం నాటికి స్వరం మార్చింది. దీనిని పున:సమీక్షిస్తామని సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేసింది. దీనికి ఎంత సమయం కావాలని మంగళవారం విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. రాజద్రోహం చట్టం దుర్వినియోగం అవువుతుందనే అభిప్రాయాన్ని, ఆందోళనను సుప్రీం కోర్టు వ్యక్తం చేసింది. ఇక సెక్షన్ 124ఏను ఉపయోగించి గతంలో ఏపీలో ఎంపీ రఘురామకృష్ణం రాజు, తాజాగా మహారాష్ట్రలో ఎంపీ నవనీత్ కౌర్‌పై రాజద్రోహం కేసులను పాలకులు నమోదు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన పాత్రికేయుడు వినోద్ దువాపై కూడా రాజద్రోహం కేసు నమోదు కాగా సుప్రీం కోర్టు దానిని కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa