నీట్ పీజీ- 2022 పరీక్షను వాయిదా వేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పరీక్షను ఆలస్యంగా నిర్వహిస్తే వైద్యుల కొరత ఏర్పడుతుందని, తద్వారా రోగుల సంరక్షణపై తీవ్ర ప్రభావం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. పరీక్షను వాయిదా వేస్తే పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న లక్షల మంది విద్యార్థుల జీవితాలను అయోమయంలోకి నెడుతుందని, గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. విద్యార్థుల్లో ఓ వర్గం వాయిదా వేయాలని కోరుతోంది. ఇలా చేస్తే పరీక్ష కోసం రెడీగా ఉన్న 2,06,000 మంది విద్యార్థులున్న మరో వర్గానికి నష్టం జరుగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది.
నీట్ పీజీ పరీక్ష ఈ నెల 21న జరగాల్సి ఉంది. అయితే నీట్ పీజీ- 2021 కౌన్సెలింగ్ ఇంకా జరుగుతుందని, అందులో సీటు రాని విద్యార్థులు నీట్-పీజీ 2022కు ప్రిపేర్ అయ్యేందుకు వీలు కల్పించాలని కోరుతున్నారు. అందుకు అనుగుణంగా పరీక్ష వాయిదా వేయాలని కొందరు వైద్యుల బృందం ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు పిటిషన్ విచారణకు మే 10న అంగీకరించింది. తాజాగా వారి అభ్యర్థనను తిరస్కరించింది. పరీక్ష వాయిదా వేయాలని భారతీయ వైద్యుల సంఘం(ఐఎంఏ) కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయను కూడా విజ్ఞప్తి చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa