రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా 160 స్థానాల్లో గెలవబోతున్నామని.. చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారని టిడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఒక గాలి పార్టీ అని.. గాలికొచ్చిన పార్టీ గాలికే పోతుందని వ్యాఖ్యానించారు. వైసీపీకి రాజకీయ పార్టీ అని చెప్పుకునే అర్హతే లేదన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని వెల్లడించారు. ‘గడప గడపకు వైసీపీ’ అని పెడితే ప్రజలు వెంటపడతారని భావించి.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ అని పెట్టారని ఎద్దేవా చేశారు. ‘బాదుడే బడుడు’ పేరుతో టీడీపీ ప్రజల వద్దకు వెళ్తోందని.. పోటీగా వైసీపీ కార్యక్రమాలు చేస్తోందని సెటైర్లు వేశారు. తాడికొండలో వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసిన వెంకాయమ్మ అనే మహిళపై దాడి చేసి అక్రమ కేసులు పెట్టారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఈ విషయమై ఇప్పటికే గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
అలాగే, వైసీపీ రాజ్యసభ అభ్యర్థులపై అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు. టీడీపీ నుంచి వచ్చిన ఇద్దరికి, జగన్ దొంగ లెక్కలు రాసే ఒకరికి, సీబీఐ కేసులు వాదించే ఇంకొకరికి రాజ్యసభ సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. బీసీలంటే టీడీపీ.. టీడీపీ అంటే బీసీలని.. ఈ బంధాన్ని సీఎం జగన్ తల్లకిందులుగా తపస్సు చేసినా విడదీయలేరని స్పష్టం చేశారు. వైసీపీ ఎన్ని నాటకాలు ఆడినా బీసీలను టీడీపీ నుంచి వేరు చేయటం జగన్ తరం కాదన్నారు. పదవులు ఇచ్చి బీసీల నోటికి ప్లాస్టరు వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం మొత్తాన్ని నలుగురు రెడ్లకు రాసిచ్చారని సెటైర్లు వేశారు.
ఇక, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉంటాయని, ఆ హక్కులను కాలరాసే విధంగా వైసీపీ ప్రభుత్వ పని తీరు ఉందని అచ్చెన్నాయుడు విమర్శించారు. మహానాడుకు వేదిక ఏర్పాటు చేసుకుంటే తిరస్కరిస్తారించారన్నారు. ప్రభుత్వం స్టేడియం ఇవ్వకపోతే మండువవారి పాలెంలో స్థలాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు. మళ్లీ ఈ రాష్ట్రానికి పూర్వస్థితి రావాలంటే టీడీపీ అధికారంలో రావాలని కోరుకుంటూ మండువవారి పాలెంలో రైతులు మహానాడు ఏర్పాటు చేసుకోవడానికి స్థలాన్ని ఇచ్చారన్నారు. ఇందుకు రైతులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నాను.
గతంలో మహానాడు మూడు రోజులు నిర్వహించే వాళ్లమని.. ఈ సారి ఎండలు అధికంగా ఉండటంతో రెండు రోజులు మాత్రమే నిర్వహిస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నెల 27న ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు 10 వేల మందితో సభ నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఆ రోజున 17 తీర్మానాలు ప్రవేశ పెడతామన్నారు. తర్వాత రోజు నిర్వహించే సమావేశంలో సాయంత్రం 3 గంటలకు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని.. అదే సమయంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ప్రారంభిస్తామని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa