ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక ఆ సర్వీసులపై ఛార్జీల మోత...జర జాగ్రత్త మరి

national |  Suryaa Desk  | Published : Sat, May 21, 2022, 07:37 PM

వంక దొరకాలే గానీ ఛార్జీలను మోపేందుకు ఎప్పటికప్పుడు బ్యాంకులు సన్నద్దమవుతున్నాయి. తాజాగా  ఆధార్ ఎనెబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) ట్రాన్సాక్షన్లపై వచ్చే నెల నుంచి చార్జీలు పడనున్నాయి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. ఐపీపీఐ బ్యాంక్ తాజాగా ఏఈపీఎస సర్వీసులపై చార్జీలు విధిస్తోంది. ఈ చార్జీలు  2022 జూన్ 15 నుంచి అమలులోకి వస్తాయి. ప్రతి నెలా మూడు ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్లను అనుమతి ఉంటుంది. వీటికి ఎలాంటి చార్జీలు పడవు. అంటే ఏఈపీఎస్ క్యాష్ విత్‌డ్రాయెల్, ఏఈపీఎస్ క్యాష్ డిపాజిట్, ఏఈపీఎస్ మిని స్టేట్‌‌మెంట్ వంటి సేవలు ప్రతి నెలా మూడు వరకు పొందొచ్చు. ఈ ఉచిత పరిమితి దాటిన తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్‌పై చార్జీలు చెల్లించుకోవాలి. క్యాష్ విత్‌డ్రాయెల్, క్యాష్ డిపాజిట్ లావాదేవీలకు అయితే ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.20తోపాటు జీఎస్‌టీ చెల్లించుకోవాలి. అదే మిని స్టేట్‌మెంట్అయితే రూ.5 చార్జీ పడుతుంది. దీనికి కూడా జీఎస్‌టీ అదనం. 


గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఏఈపీఎస్ ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందుతున్నారు. ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్ పూర్తి కావాలంటే కచ్చితంగా బ్యాంక్ కస్టమర్లు బయోమెట్రిక్ అవసరం అవుతాయి. లేదంటే ఏఈపీఎస్ సేవలు పొందలేం. ఒకే బ్యాంక్‌లో ఎక్కువ సేవింగ్స్ ఖాతాలు కలిగి ఉంటే.. ప్రైమరీ బ్యాంక్ అకౌంట్‌ ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహించడం వీలవుతుంది. అన్ని అకౌంట్లకు ఏఈపీఎస్ సేవలు లభించవు. దీని కోసం కస్టమర్లు బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లి ప్రైమరీ బ్యాంక్ అకౌంట్‌ను మార్చుకోవచ్చు.


ఇదిలావుంటే ఏఈపీఎస్ సర్వీసుల కింద బ్యాంక్ కస్టమర్లు ఆధార్ సాయంతో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లు నిర్వహించొచ్చు. బ్యాలెన్స్ ఎంక్వైరీ, క్యాష్ విత్‌డ్రాయెల్, రెమిటెన్స్ ఇలా పలు సేవలు పొందొచ్చు. అయితే ఇక్కడ బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ నెంబర్ కచ్చితంగా అనుసంధానం అయ్యి ఉండాలి. లేదంటే ఈ సర్వీసులు పొందలేం. ఏఈపీఎస్ సర్వీసుల కోసం కస్టమర్లు బ్యాంకింగ్ కరస్పాండెంట్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. వీళ్ల ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి పలు రకాల సేవలు అందిస్తారు.


ఇదిలావుంటే మరోవైపు పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో పోస్టాఫీస్ అకౌంట్ కలిగిన వారు ఆన్‌లైన్‌లో మనీ ట్రాన్స్‌ఫర్ సులభంగా చేయొచ్చు. ఇప్పటికే నెఫ్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆర్‌టీజీఎస్ సర్వీసులు మే 31 కల్లా అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవల వల్ల పోస్టాఫీస్ కస్టమర్లు వారి పోస్టాఫీస్ అకౌంట్ నుంచి ఇతర బ్యాంకులకు నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు పంపొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa