ట్రెండింగ్
Epaper    English    தமிழ்

30న ధర్నాను విజయవంతం చేయండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 29, 2022, 08:11 AM

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు, పెంచిన ధరలకు నిరసనగా ఈ నెల 30న సత్యసాయి జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న ధర్నా ను విజయవంతం చేయాలని సిపిఎం, సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. శనివారం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ ఎస్ వెంకటేష్ మాట్లాడుతూ, కార్పొరేట్ శక్తులకు ఈ ప్రభుత్వలు కొమ్ము కాస్తున్నాయన్నారు.పెట్రోలు డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నాయన్నారు. ప్రజావ్యతిరేకత గుర్తించి కంటితుడుపుగా అరకొరగా ధరలు తగ్గించినంత మాత్రాన సామాన్యుల బ్రతుకులు మారవన్నారు.


పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. 30న వామపక్షాలు ప్రజా సంఘాలు చేపట్టిన ధర్నాలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు బ్యాళ్ళ అంజి, పైపల్లి గంగాద్రి, గౌస్ లాజం పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa