నెల రోజుల్లోగా నేతల మధ్య విబేధాలు, గ్రూపు రాజకీయాలు లేకుండా చూడాలని.. అప్పటికీ మార్పు రాని నేతల విషయంలో కఠిన నిర్ణయాలు ఉంటాయని చిత్తూరు, తిరుపతి లోక్ సబ నియోజకవర్గ పార్టీ నేతలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. మహానాడు తర్వాత మళ్లీ పార్టీపై ఫోకస్ పెట్టారు.. మళ్లీ నియోజకవర్గాలవారీగా సమీక్షలు మొదలయ్యాయి. ముందుగా చిత్తూరు, తిరుపతి లోక్సభ నియోజకవర్గాల సమన్వయకర్త బీద రవిచంద్రతో భేటీ అయ్యారు. ఆ రెండు లోక్సభ స్థానాల పరిధిలోని నేతల పనితీరుపై రవిచంద్ర నివేదిక అధినేతకు ఇచ్చారు. నెలలో పదిహేను రోజుల పాటు నియోజకవర్గాల్లో పర్యటించాలని రవిచంద్రకు చంద్రబాబు సూచించారు.
ఈ రెండు నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయి పర్యటన తర్వాత నేతల పని తీరుపై తనకు మరోసారి పూర్తిస్థాయిలో రిపోర్ట్ ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. పార్టీకి ఇబ్బంది కలిగిందే నేతల లిస్ట్ కూడా సిద్ధం చేయమని సూచించారు. నెల రోజుల్లోగా నేతల మధ్య విబేధాలు, గ్రూపు రాజకీయాలు లేకుండా చూడాలని.. అప్పటికీ మార్పు రాని నేతల విషయంలో కఠిన నిర్ణయాలు ఉంటాయని తేల్చి చెప్పారు.
అంతేకాదు మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలతో వరుస భేటీలు నిర్వహించబోతున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో భాగంగా సమీక్షలు చేస్తున్నారని.. అందుకే ఇప్పటి నుంచే చంద్రబాబు కసరత్తు ప్రారంభించారనే టాక్ వినిపింస్తోంది. ముందుగా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు, తిరుపతి నుంచే సమీక్షలు మొదలు పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa