ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు మరిన్ని వేరుశెనగ విత్తన కాయలు ఇవ్వాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 11, 2022, 01:23 PM

చిత్తూరు: గుర్రంకొండ మండల రైతులకు పంపిణీ చేసిన వేరుశెనగ విత్తన కాయలు చాల్లేదని, మరికొన్ని వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు కోరారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో సోమేపల్లి సీతమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. వ్యవసాయ అధికారి కౌశిక్ సమాధానమిస్తూ రైతుల కోరికపై అదనంగా వేరుశెనగ విత్తన కాయలు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపామన్నారు. సమావేశంలో మండల అధికారులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa