ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్య నిషేధం విషయంలో చేసిన హామీ విషయంలో వై.ఎస్.జగన్ సర్కార్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ‘సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం 'కాదు కాదు' సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం. చిన్న గమనిక.. సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే.. సామెతలు 12:22 అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు’అన్నారు.
ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధమంటే మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడమా అంటూ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. గతంలో మద్యం ద్వారా రూ. 9,000 కోట్ల ఆదాయం ఉంటే.. ప్రస్తుతం మద్యం ఆదాయం రూ.22,000 కోట్లకు పెరిగిందన్నారు. మద్యపాన నిషేధం అంటే ఇదేనా అంటూ ట్వీట్ చేశారు. ‘సంపూర్ణ మద్యపాన నిషేధం అనగా మద్యం ఆదాయం రూ. 9 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెంచుట!! ఆ రాబడి చూపించి రూ. 8 వేల కోట్ల బాండ్లు బజార్లో అమ్ముట! ఇదీ ‘స్పిరిటెడ్ విజనరీ’ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో అమలు. జాక్పాట్!’అంటూ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఇప్పుడు మళ్లీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa