రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ఓ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల నైరుతి రుతుపవనాలు అత్యంత ఆలస్యంగా కదులుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించాల్సిన రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించారు. ప్రస్తుతం కర్ణాటకతో పాటు కొంకణ్, గోవా తదితర ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలు ఉత్తర కొనదాహాను, పుణె, బెంగళూరు, పుదుచ్చేరిపై ఉన్నాయని ఐఎండీ వివరించింది.
ఈ క్రమంలో రాబోయే 48 గంటల్లో కొంకణ్ సహా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకి రుతుపవనాలు విస్తరించే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తెలంగాణ, ఏపీ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. మరోవైపు ఉత్తర భారతదేశానికీ రుతుపవనాలు వేగంగా విస్తరించేలా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నట్లు ఐఎండీ పేర్కొంది.
ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరకోస్తాంధ్ర మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి స్వల్పంగా బలహీనపడనుందని ఐఎండీ తెలిపింది. దీంతో రాబోయే రెండు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిసే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ విభాగం పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa