ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం, మంత్రులను విమర్శిస్తే ఎలా వేటువేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 04:15 PM

తమ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ లోక్‌సభ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ ఇచ్చిన పిటిషన్‌ను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రివిలేజ్‌ కమిటీకి పంపించారు. దీంతో ప్రాథమిక దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని స్పీకర్‌ కోరినట్లు లోక్‌సభ బులెటిన్‌ వెల్లడించింది. ఈ క్రమంలో ఇటీవలే రఘురామ అనర్హత పిటిషన్పై లోక్సభ ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిపింది. ఈ విచారణలో వైసీపీ ఎంపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఊరాట లభించింది. ఈ కమిటీ ముందు వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ హాజరయ్యారు. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ సునీల్కుమార్ సింగ్ దీనిపై విచారణ చేపట్టారు. రఘురామ పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా వివరించారు. ఈ క్రమంలో పార్టీ అధినేతపై విమర్శలు చేస్తే అనర్హత వేటు కిందకు రాదని.. లోక్‌సభలో పార్టీ విప్‌ను దిక్కరిస్తే మాత్రమే వస్తుందని స్పీకర్ కార్యాలయం కీలక వ్యాఖ్యలు చేసింది.


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సొంత పార్టీ ఎంపీ రఘురామ ఆరోపణలు అనర్హత వేటు కిందకు రాదని స్పష్టం చేసింది. పార్టీ జారీ చేసిన విప్‌ను ఉల్లంఘిస్తేనే అనర్హత వేటు కిందకి వస్తుందని స్పీకర్‌ ఆఫీస్‌ వెల్లడించింది. ముఖ్యమంత్రి, మంత్రులను విమర్శిస్తే అనర్హత వేటు కిందకి రాదని స్పీకర్ కార్యాలయం తెలిపింది. రఘురామ అనర్హత పిటిషన్ ప్రస్తుతం ప్రివిలైజ్ కమిటీ ముందు ఉందని, విచారణ ఎప్పుడు పూర్తవుతుందో కమిటీ చెబుతుందని స్పీకర్‌ కార్యాలయం తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa