ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రహస్యంగా విగ్రహం అమ్మేయత్నం...అడ్డంగా దొరికిపోయారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 12, 2022, 04:16 PM

పురాతన కాలానికి చెందిన ఓ విగ్రహాన్ని అమ్మేక్రమంలో నిందితులు  పోలీసులకు పట్టుబడ్డారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పురాతన పంచ ముఖా వినాయక విగ్రహం కలకలంరేపింది. కొంతమంది ప్రముఖులు ఈ విగ్రహాన్ని విక్రయించేందుకు లావాదేవీల నడుపుతూ దొరికిపోయారు. పక్కా సమాచారం అందుకున్న నిఘా విభాగానికి చెందిన అధికారులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విగ్రహంతో పాటూ ఉన్న ఇంద్రసేనారెడ్డి, వెంకటేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.


ఈ విషయంలో నిజానిజాలు ఎలా ఉన్నా.. విగ్రహం ప్రస్తుతం యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్‌లో ఉంది.. పూర్తి విచారణ జరిపి విగ్రహం వివరాలు తెలుపుతామని పోలీసులు అంటున్నారు. మరకత విగ్రహం కాగా.. పంచముఖంగా ఉంది. అసలు విగ్రహం ఎక్కడి నుంచి తెచ్చారు అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ విగ్రహం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa