"దేశంలోని చాలా ప్రాంతాల్లో చట్టవిరుద్ధమైన బెట్టింగ్, జూదం, వినియోగదారులకు ముఖ్యంగా యువత, పిల్లలకు గణనీయమైన ఆర్థిక, సామాజిక ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది" అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ బెట్టింగ్ ప్రచార ప్రకటనలపై కేంద్రం కొరఢా ఝళిపించింది. ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫారమ్ల ప్రకటనలకు దూరంగా ఉండాలని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం సూచించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో బెట్టింగ్, జూదం చట్ట విరుద్ధమని, వీటివల్ల వినియోగదారులకు గణనీయమైన నష్టాలు కలుగుతున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మధ్య కాలంలో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్, ఆన్లైన్ మీడియాల్లో ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్స్ ప్రకటనలు భారీగా పెరుగుతుండడంతో కేంద్రం ఈ అడ్వైజరీ జారీ చేసింది. ఈ సందర్భంగా నిషేధిత కార్యకలాపాలను ప్రోత్సమించేలా యాడ్స్ ఉన్నాయని అభిప్రాయపడింది. అలాంటి ప్రకటనలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని, ఇవి వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019కి విరుద్ధమని పేర్కొంది.వినియోగదారులను దృష్టిలోపెట్టుకుని ఈ చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించింది.
ప్రజాప్రయోజనాల కోసం ఈ అడ్వైజరీని జారీ చేయడం జరిగిందని తెలిపింది. ఈ మేరకు ఇక నుంచి ఆన్లైన్ బెట్టింగ్ ఫ్లాట్ఫారమ్ల ప్రకటనలను ప్రచురించడం మానుకోవాలని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు సూచించింది. ఆన్లైన్ ప్రకటనల మధ్యవర్తులు, పబ్లిషర్లతో సహా సోషల్ మీడియాలో కూడా ఇటువంటి ప్రకటనలను ప్రదర్శించవద్దని, భారతీయ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకోవద్దని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa