అంతర్జాతీయంగా నెలకొన్ని పరిణామాల నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకొంది. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలు, గోధుమ పిండిని తమ దేశం నుంచి 4 నెలలపాటు ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా యూఏఈ నిషేధం విధించింది. అయితే భారత్ నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన గోధుమలు, గోధుమ పిండిని కంపెనీలు ఎగుమతి చేసుకోవచ్చని యూఏఈ స్పష్టం చేసింది. కానీ ఇందు కోసం కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఎగుమతుల కోసం కంపెనీలకు ఇచ్చిన పర్మిషన్ 30 రోజులపాటు చెల్లుబాటు అవుతుందని.. యూఏఈ నుంచి షిప్మెంట్ను ఎగుమతి చేయడానికి పర్మిషన్ పత్రాలను కస్టమ్స్ విభాగానికి తప్పనిసరిగా అందించాలని ఆ దేశ ఆర్థిక శాఖ ఆదేశించింది.అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతులపై ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం ఆ దేశం మీదుగా భారత గోధుమలు పక్కదారి పట్టకుండా చూసేందుకు దోహదం చేస్తుంది.
దేశీయ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో.. గోధుమ ఎగుమతులను నిషేధిస్తున్నట్లు మే 14న భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని ప్రపంచ దేశాలు కోరడంతో.. ఆహార కొరత తలెత్తకుండా ప్రపంచ దేశాలకు 469,202 టన్నుల గోధుమల ఎగుమతికి భారత్ అనుమతి ఇచ్చింది. తమకు గోధుమలను సరఫరా చేయాలని ఇండోనేసియా, ఒమన్, యూఏఈ, బంగ్లాదేశ్, యెమన్ దేశాలు భారత్ను కోరాయి. దీంతో యూఏఈ ప్రజల అవసరాలకు సరిపడా గోధుమలను పంపేందుకు భారత్ సుముఖత వ్యక్తం చేసింది. భారత్తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేసిన నేపథ్యంలో... తమ దేశం మీదుగా భారత గోధుమలు విదేశాలకు ఎగుమతి కాకుండా యూఏఈ ఈ నిర్ణయం తీసుకుంది.
మే 13వ తేదీకి ముందు భారత్ నుంచి గోధుమలు, గోధుమ పిండిని దిగుమతి చేసుకున్న కంపెనీలు.. తిరిగి వాటిని యూఏఈ వెలుపలకు ఎగుమతి, రీ-ఎక్స్పోర్ట్ చేయడానికి తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని యూఏఈ ఆర్థిక సూచించింది. గోధుమల షిప్మెంట్, అవి ఏ దేశం నుంచి వచ్చాయి, చెల్లింపులు జరిపిన తేదీ తదితర డాక్యుమెంట్లను తనిఖీ కోసం సబ్మిట్ చేయాలని ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa