ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెడలు వంచుతారా లేక కేసుల మాఫి కోసం మీరే తలవంచుతారా: నారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 17, 2022, 04:44 PM

హోదా కోసం కేంద్రం మెడలు వంచుతారా లేక కేసుల మాఫి కోసం మీరే తలవంచుతారా అని వైసీపీని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. ‘ఎన్డీఏ అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి అని ఏ2 సెలవిచ్చారు.స్పెషల్ స్టేటస్ సాధిస్తారని 22 మంది ఎంపీలని ప్రజలు ఇచ్చారు. ఎన్నికలకి ముందు ప్రత్యేక హోదా కోసం మీరు పోరాడింది నిజమైతే.. ప్రత్యేక హోదా ప్రకటిస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని ప్రకటించగలరా? మెడలు వంచుతారా? కేసుల మాఫీ కోసం తల దించుతారా జగన్ రెడ్డి గారు?’అంటూ ట్వీట్ చేశారు.


ఏపీలో రాష్ట్రపతి ఎన్నికల హీట్ మొదలైంది. ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఎవరికి అనే అంశంపై చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలు వైసీపీని టార్గెట్ చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు.. హోదా ఇస్తామంటేనే మద్దతు తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విధంగా స్పందించారు.


మరోవైపు సీపీఐ నేత రామకృష్ణ కూడా స్పందించారు. రాష్ట్రపతి ఎన్నికపై వైఎస్సార్‌సీపీ విధానమేంటని ప్రశ్నించారు. మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు జగన్ మద్దతు ఇవ్వాలని.. ఇటీవల ప్రధానిని కలిసిన వైఎస్‌ జగన్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం సాగుతోందన్నారు. 25 పార్లమెంట్ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తా అని జగన్ హామీ ఇచ్చారని.. 2014 ఎన్నికలలో ఓడి తర్వాత నుంచి 2019 ఎన్నికల‌ వరకు ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పింది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు.


రాష్ట్రపతి ఎన్నిక కోసం ముఖ్యమంత్రి జగన్ అవసరం ఎన్డీఏకు ఉందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతిస్తానని జగన్ ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. మెడలు‌ వంచుతా అన్న వ్యక్తి.. నోరెందుకు విప్పడం లేదన్నారు. ప్రతిపక్ష పార్టీలు సమావేశానికి వెళ్లకపోవడం మెడలు‌ వంచడం కాదన్నారు. జగన్‌ను నమ్మి గెలిపిస్తే.. ఆయన స్వార్ధ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని ఆరోపించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa