ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలోని పరిణామాలు గమనిస్తున్నామని అమిత్ షా అన్నారు: రఘురామకృష్ణరాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 17, 2022, 04:45 PM

తన నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉందని, ఆయనతోపాటు ప్రోటోకాల్‌ ప్రకారం సభకు హాజరుకావాల్సి ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. దీనిపై తాను రాసిన లేఖకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందించారని.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని షా తన లేఖలో పేర్కొన్నట్లు వివరించారు. మాట ఇచ్చి తప్పితే రాజకీయాలలో కొనసాగే అర్హత ఉందా అంటూ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇప్పటికేౖనా, అప్పు చేసైనా అమలు చేయాలన్నారు. అనేక హామీలను తమ పార్టీ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు.


ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తామని.. హోదాను సాధిస్తే ఉద్యోగ విప్లవం వస్తుందని ఎన్నికలకు ముందు జగన్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడిగే ధైర్యం చేయడం లేదని సెటైర్లు పేల్చారు. కనీసం రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగానైనా హోదా ఇస్తేనే మద్దతిస్తామని డిమాండ్ చేయాలన్నారు. ఇది మంచి అవకాశం అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే అవకాశం వైసీపీకి వచ్చిందని.. ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయాలని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.


మాట తప్పితే రాజకీయాల్లో ఉండటానికి అనర్హులని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఎంపీ గుర్తుచేశారు. పంట పెట్టుబడికి రూ.12,500 ఇస్తామని.. రూ.7500 మాత్రమే ఇచ్చారని ధ్వజమెత్తారు. రూ.4,500 కోట్లతో విపత్తు నిధి అన్నారని.. కానీ ఇవ్వలేదని విమర్శించారు. డాక్టర్ల సంఖ్య పెంచడమంటే వాచ్‌మెన్‌లతో వైద్యం చేయించడం కాదని.. మద్యనిషేధం అన్నారు.. మద్యం బాండ్లపై అప్పు తెచ్చారని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa